గాయకులు: సాగర్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
రచన : విశ్వ
_________________________________________________________________________________
పల్లవి
యేదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో.. ప్రేమా ఆ సందఢి నీదేనా
యేదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో.. ప్రేమా ఆ సవ్వఢి నీదేనా
ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా.. ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన
ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే
నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం, నువ్వుంటే మనసంతా ఏదో తీయని సంగీతం
నువ్వుంటే ప్రతి అడుగు అందం, నువ్వుంటే ప్రతి క్షణమూ స్వర్గం, నువ్వుంటే ఇక జీవితమంతా ఏదో సంతోషం
చరణం 1:
పాట పాడదా మౌనం పురివిప్పి ఆడదా ప్రాణం.. అడవినైన పూదోట చేయదా ప్రేమ బాటలో పయనం
దారి చూపదా శూన్యం అరచేత వాలదా స్వర్గం.. ఎల్లదాటి పరవళ్లు తొక్కదా వెల్లువైన ఆనందం
ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం.. ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం
ప్రేమా ఓ ప్రేమా గుండెల్లో కలకాలం
నువ్వుంటే ప్రతి ఆశా సొంతం, నువ్వుంటే చిరుగాలే గంధం, నువ్వుంటే ఎండైనా కాదా చల్లని సాయంత్రం
నువ్వుంటే ప్రతి మాటా వేదం, నువ్వుంటే ప్రతి పలుకూ రాగం, నువ్వుంటే చిరునవ్వులతోనే నిండెను ఈ లోకం
చరణం 2:
ఉన్నచోట ఉన్నానా ఆకాశమందుకున్నానా.. చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేనా
మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన.. ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన
హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే.. సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
ప్రేమా ఓ ప్రేమా ఇది శాశ్వతమనుకోనా
నువ్వుంటే దిగులంటూ రాదే, నువ్వుంటే వెలుగంటూ పోదే, నువ్వుంటే మరి మాఠలు కూడా పాటైపోతాయే
నువ్వుంటే ఎదురంటూ లేదే, నువ్వుంటే అలుపంటూ రాదే, నువ్వుంటే ఏ కష్ఠాలైనా ఎంతో ఇష్టాలే
0 కామెంట్లు:
కామెంట్ను పోస్ట్ చేయండి